AP ఉచిత కుట్టు మెషిన్ పథకం 2025 – అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ & ప్రయోజనాలు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం AP ఉచిత కుట్టు మెషిన్ పథకం 2025 ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు మరియు శిక్షణ అందించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యం.
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలు, 60 నియోజకవర్గాలు లో మొత్తం 1 లక్ష కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,000 మిషన్లు కేటాయించబడతాయి.
AP ఉచిత కుట్టు మెషిన్ పథకం 2025 – అర్హతలు
ఈ పథకం ప్రయోజనాలను పొందాలనుకునే మహిళలు కింది అర్హతలు కలిగి ఉండాలి:
మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
దరఖాస్తుదారులు ఆంధ్ర ప్రదేశ్ లో స్థిర నివాసం కలిగి ఉండాలి.
సరైన ఆధార్ కార్డు ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రం (కావాల్సిన వారికి) ఉండాలి.
వయస్సు: 20 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆర్థిక పరిమితి:
గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ₹1.5 లక్షలు మించరాదు.
పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ₹2 లక్షలు మించరాదు.
వితంతువులు మరియు దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు.
శిక్షణ సమయంలో కనీసం 70% హాజరు తప్పనిసరి.
ప్రస్తుతం BC మరియు EWS కులాలకు చెందిన మహిళలు మాత్రమే అర్హులు.
హౌస్ మ్యాపింగ్ ద్వారా నివాస ప్రామాణికతను నిర్ధారించుకోవచ్చు.
AP ఉచిత కుట్టు మెషిన్ పథకం 2025 – దరఖాస్తు విధానం
ఈ పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు.
దరఖాస్తుదారులు గ్రామ/వార్డు సచివాలయం ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు
దరఖాస్తుతో పాటు కింది పత్రాల జిరాక్స్లు సమర్పించాలి:
- ఆధార్ కార్డు
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం (కావాల్సిన వారికి)
- రేషన్ కార్డు / రైస్ కార్డు
- పనిచేస్తున్న మొబైల్ నంబర్
- పాస్పోర్ట్ సైజు ఫోటో
- దరఖాస్తు ఫార
AP ఉచిత కుట్టు మిషిన్ పథకం 2025 ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పొందే అవకాశం ఉంది.
మీరు అర్హులైతే, మీ సమీప గ్రామ/వార్డు సచివాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోండి.
ఇంకా మరిన్ని వివరాల కోసం మీ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించండి.
