SnehaJobs.com

GSWS Updates|| VSU Previous Papers||Study Materials||Latest Jobs

6 వ తరగతి

6th Class General Science

  • అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే పోటాసీయం అనే పదార్ధం ఉంటుంది.
  • ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులున్న పదార్ధంతో కలిపి తినాలి.
  • చికోరి జీర్ణవ్యస్తకు, రక్త ప్రసరణ వ్యస్థకు మేలు చేస్తుంది.
  • టమాటాలో విటమిన్ ‘సీ’ అనే పధార్ధం ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది.
  • ఇప్పటివరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్ధాలలో నియోదైమియం బలమైన అయస్కాంతం.
  • Loadstones – సహజ అయస్కాంతం (Magnash – గొర్రెలకాపరి – అయస్కాంతము ను కనుగొన్నాడు.
  • సాధారణం గా ఇనుము , నికేల్ , రాగి , కోబాల్ట్ , అల్యూమినియం ల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతలను తయారు చేస్తారు.
  • సాదారణంగా అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు.
  • ఒక అయస్కాంత పదార్ధం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నపుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు.
  • వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగం తో ప్రయాణిస్తుంది.
  • నీటి ని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియనే భాష్పీభవనం అంటారు .
  • నీటి ఆవిరి నీరు గా మారే ప్రక్రియ – సాంద్రీకరణం ( ధ్రవీభవనం )
  • పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్ , నై ట్రోజన్ డై ఆక్సైడ్ లతో మేఘాలు కలుషితమైనపుడు ఆమ్లవర్షాలు కురుస్తాయి.
  • 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రికేంబ్రయన్ కాలం లో మొదటగా జంతువులు ఉద్భవించాయి.
  • జంతువులను ఆరు ప్రాధమిక సమూహాలుగా వర్ఘీకరిస్తారు అవి , అకశేరుకాలు, ఉబయ చరాలు , పక్షులు , చేపలు , సరీసృపాలు , క్షీరదాలు.
  • స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. జీవితం లో ఎక్కువ కాలం ఒక ప్రదేశం లో స్థిరం గా ఉంటాయి.
  • జంతువులలో నీలి తిమింగళాలు చాలా పెద్దవి.
  • క్రేన్ ఫ్లై లార్వ దశలో ఉన్నపుడు ఎక్కువగా తింటుంది . కానీ ఫ్రౌదాజీవిగా మారిన తరువాత దానికి ఆహారం తినవలసిన అవసరమే ఉండదు.
  • 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మిసోజాయిక్ యుగం లో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి.
  • రక్తాన్ని పీల్చడానికి జలగా నోటిలో చూశాకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి.
  • రాత్రి వేళల్లో ఆహారాన్ని సేకరించి పగలు చీకటి ప్రదేశాలలో దక్కునే వాటిని నిశాచరులు అంటారు. ఉదాహరణకు బొద్ధింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూబలు . మాల్ ( రెక్కపురుగు ) , ఇలకోడి.
  • చీమలు ‘హనీఢ్యూ’ అనే పదార్ధం కోసం ఎపిడ్స్ అనే ఒకరకమైన కీటకాలను పెంచుతాయి. ఇవి ఫేరమోన్స్ అనే రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా సమాచారాన్ని తెలుపుతాయి.
  • ఒక వస్తువు రంగు దానినుంచి విడుదలయ్యే కాంతి రంగు పై ఆదరపడి ఉంటుంధి.
  • ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు సాంధ్రత తో బాటు మాధ్యమం సాంధ్రత పై కూడా ఆదరపడి ఉంటుంది.
  • నీటి సాంధ్రత 1 గ్రా /మీ.లీ. ఎధైన వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రా / మీ. లీ . కన్నా తక్కువ ఉండాలి.
  • నదులలో మంచినీరు , సముద్రాలలో ని ఉప్పునీటితో కలిసే ప్రాంతాలలో మడ అడవులు (మాంగ్రూవ్) పెరుగుతాయి.
  • కర్పూర వృక్షం ( సిన్నాయోమమ్ కాంపొర ) చెట్టు బేరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు.
  • ఉప్పు , పటిక మొదలైన స్పటికాలలో కూడా నీరు ఉంటుంది . దీనిని స్పటిక జాలం అంటారు .
  • జోర్ధన్ దేశం లో మృత సముద్రం ఉంది .
  • ఒడిసా లోని చిలకా సరస్సు మన దేశం లో ఉన్న అతిపెద్ద ఉప్పునీటి సరస్సు.
  • ఏదైనా పదార్ధం నేరుగా ఘనరూపం నుండి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుండి ఘన రూపం లోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు.
  • రంగులను వేరు చేసే పద్ధతిని క్రొమోటోగ్రఫి అంటారు.
  • ఘన స్థితిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను ‘డ్రైఐస్’ అంటారు.
  • ఒక ద్రవం నుంచి కరిగిన పధర్దాలను వేరుచేయడానికి స్పటికీకరణం పద్దతిని ఉపయోగిస్తారు.
  • నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి స్వేదనం పద్దతిని ఉపయోగిస్తారు.
  • బైండింగ్ లో ఉపయోగించే గుడ్డను ‘కాలికో’ అంటారు.
  • దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జీన్నింగ్ అంటారు.
  • దూది పీచును ఉపయోగించి నూలు దారాలను తయారు చేయడాన్ని వడకడం అంటారు.
  • జనప నారను ‘బంగారు దారం’ అంటారు.
  • వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు.
  • కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు.
  • మిరపకాయలో కారం కలిగించే పదార్ధాన్ని ‘కాప్సిసియమ్ ‘ అంటారు.
  • ఒక పదార్ధం ద్రవస్తితి నుంచి ఘన స్తితికి మారడాన్ని స్పటికీకరణం అంటారు .
  • పాలను పెరుగుగా మార్చే భ్యాక్టీరియాయ లాక్తోబాసిల్లాస్
  • డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాలనుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయగ్యులేషన్ అంటారు.
  • వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ ( Radio Detection and Ranging ) అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం , మంచు మోదలైన వాటిని గురించి తెలుసుకుంటారు.
  • విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త (1544-1603) విద్యుత్ ను కనుగొన్నాడు.ఇది కదిలే ప్రవాహం లాంటిదని దానికి హూమర్ అని పేరు పెట్టాడు.
  • మైఖేల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త (1791-1867) మొట్ట మొదటిగా విద్యుత్ మోటార్ ను, విద్యుత్ జనరేటర్ ను కనుగొన్నాడు.
  • బల్బ్ ఫీలమెంట్ లో వాడే పదార్దం- టంగ్ స్టన్.
  • ప్రపంచంలో అతి పొడవైన వంతెన ‘కూషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ ‘(164.8K.M)( చైనా ).
  • ఒక గజం =3 అడుగులు , 1 అడుగు = 12 అంగుళాలు .
  • 1957 ఏప్రిల్ 1న మనదేశం మెట్రిక్ పద్దతిని ప్రామాణిక పద్దతిగా స్వీకరించబడింది.
  • విమానాలు , ఓడల వేగాన్ని నాట్ లు /నాటికల్ మైళ్ళలో కొలుస్తారు.  ఒక నాట్ =1.852 కి . మీ /గం .
  • ఒక మైలు =1.61 M.
  • ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని ‘పారలాక్స్ ‘ యూనిట్లలో కొలుస్తారు.
  • అత్యంత వేగంగా పరిగెత్తగలిగే జంతువు – చిరుతపులి (97కి.మీ).
  • నెమ్మదిగా కదిలే జంతువు –నత్త (0.013-0.028 మీ /సె).
  • పక్షులలో అతి చిన్న పక్షి – హమ్మింగ్ బర్డ్ (5.70 CM).
  • పక్షులోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది (345 పౌండ్లు ).
  • కొన్ని కండరాలకు గుండ్రంగా,తెల్లగా ఉండే దారాలాంటి తంతువులు ఉంటాయి . వీటిని ‘టెండాన్’ అంటారు. వాటి చివరాలు ఎముకకు అతికి ఉంటాయి.
  • మన శరీరంలో పొడవైన ఎముక ‘ఫీమర్ ‘ ఇది తొడలో ఉంటుంది.
  • రెండు ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి.వీటిని లిగమెంట్లు అంటారు.
  • మానవ శరీరంలో నీటిపై  తేలగల అవయవం – ఊపిరితిత్తులు .
  • మానవుని పుర్రె లో 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్ని ‘కార్నియం’ అంటారు.
  • మన శరీరంలో 206 ఎముకలు, 230 కీళ్ళు ఉంటాయి.
  • సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిముషాల 17 సె. సమయం పడుతుంది.
  • ఆకుపచ్చ,ఎరుపు,నీలం రంగులను ప్రాధమిక వర్ణాలు అంటారు. ఇవి వివిధ పాళ్ళలో కలసి అనేక రంగులను ఏర్పరుస్తాయి.
  • కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘దుశా శాస్త్రం ‘ (optics) అంటారు.
  • భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి 1.255 సెకనుల సమయం పడుతుంది.
  • మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే.
  • కోడిగుడ్డు తెల్లసొనలో ‘ఆల్బూమిన్ ‘ అనే ప్రోటీన్ ఉంటుంది.
  • జగదీశ్ చంద్రబోస్ మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిరూపించారు.
  • జున్ను తయారు చేయడంలో శిలీంద్రాలను ఉపయోగిస్తారు. దీనిని ‘ కిణ్ణ్వానమ్ ‘ అంటారు.
  • క్రీ.శ 1590 లో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్ అతని తండ్రి హేన్స్ మైక్రోస్కోప్ ను కనుగొన్నాడు.
  • మనం ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు కూడా శిలీంద్రాలే .
  • శైశవ దశలో వెన్నెముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి.ఆ తరువాత చివర 9 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడుతాయి.
  • కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినపుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.
  • మానవుని గుండే నిముషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది.

 Click Here to Read 7th Class 

Updated: July 11, 2020 — 7:18 am
Disclaimer- We (snehajobs.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. All Rights Reserved

You cannot copy content of this page